తమ్ముడు కేటీఆర్ ను సాక్ష్యాలు చూపమంటున్న సబితక్క

February 02, 2015 | 11:06 AM | 25 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబం 30 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తోందని, అలాంటిది ఇలా ఆరోపణలు చేయటం కేటీఆర్ కు తగదని ఆమె అన్నారు. ‘‘అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు బ్రదర్. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకోను’’ అంటూ ఫైరయ్యారు. చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత లాభం కోసమే డాక్టర్ రాజయ్యను బకారాను చేశారని కేసీఆర్ కుటుంబ సభ్యుల నుద్ధేశించి ఆమె వ్యాఖ్యానించారు. కాగా, రంగారెడ్డి పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ