సీఎం సిద్ధరామయ్యకి ‘వాచి’పోతుంది

February 12, 2016 | 04:48 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Karnataka- lokayukta-CM-siddaramaiah- costly-watch-niharonline

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. చేతిగడియారం వ్యహారం లోకాయుక్త ముందుకు చేరింది. 50 నుంచి 70 లక్షల రూపాయల విలువ చేసే 'హ్యూబ్లోట్' వాచ్ ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన ఎన్నికల అఫిడవిట్లో చేర్చలేదని మానవహక్కుల రక్షణా సమితి కార్యకర్త రామమూర్తి గౌడ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అత్యంత ఖరీదైన వాచ్ వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చాలని ఆయన లోకాయుక్తను కోరారు. 2015 మార్చి31న లోకాయుక్తకు అందజేసిన వివరాల్లో ముఖ్యమంత్రి ఈ వాచ్ గురించి ప్రస్తావించలేదు.

వ్యవసాయం ద్వారా ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్టు, వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏడాదికి 38 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే భార్య పేరిట బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లపై ఏటా 1.25 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, పిల్లలకు ఉన్న వ్యవసాయం ద్వారా 25 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్టు ఆయన లోకాయుక్తకు గతంలోనే తెలిపారు. దీంతో ఈ వాచ్ వ్యవహారం నిగ్గుతేల్చాలని రామమూర్తి లోకాయుక్తను కోరినట్లు సమాచారం. అయితే ఓ స్నేహితుడి దీనిని ఆయనకు గిఫ్ట్ ఇచ్చినట్లు సిద్ధరామయ్య సన్నిహితులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ