రాజ్ భవన్ లో మాజీ ప్రధానికి ఘోర అవమానం!

April 05, 2016 | 11:10 AM | 2 Views
ప్రింట్ కామెంట్
devegowda_insulted_at_rajbhavan_niharonline

లోకాయుక్తను నిర్వీర్యం చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడలను వేస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయివాలాకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడకు అవమానం జరిగింది. ఆయన తన కుమారుడు కుమారస్వామి, జనతాదళ్ పార్టీ నేతలతో కలసి రాజ్ భవన్ వరకూ పాదయాత్రగా వెళ్లిన ఆయనకు, లోపలికి ప్రవేశించేందుకు అనుమతి లభించలేదు.

అపాయింట్ మెంట్ తీసుకున్నామని చెప్పినప్పటికీ, అధికారులు లోపలికి పంపకపోవడంతో ఆయన మండిపడ్డారు. కన్నడిగుల పట్ల గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా మాజీ ప్రధాని హోదాలో ఉన్న తనను రాజ్ భవన్ లోకి అనుమతించకపోవటం ఏంటని ఆయన ఊగిపోయారు. అవినీతిని అడ్డుకుంటామని చెబుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవినీతి నియంత్రణ దళం, కేవలం లోకాయుక్తను సమాధి చేసేందుకే పనికి వస్తుందని అన్నారు. రాజ్ భవన్ వద్ద ఎంతసేపు వేచి చూసినా గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో చివరికి దేవగౌడ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ