ప్రధానిగా కాదు-పార్లమెంటేరియన్ గా బువ్వతిన్న మోదీ

February 19, 2015 | 11:44 AM | 84 Views
ప్రింట్ కామెంట్
Narendra_Modi_meals_niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని కొరుకుంటారు. తాజాగా సోమవారం పార్లెమెంట్ క్యాంటీన్లో భోజనం రుచి చూడాలనుకున్న ఆయన అనుకున్నదే తడవుగా శాఖాహార భోజనాన్ని ఆరగించారు. అయితే ఆయన భోజనం చేసింది ప్రధాని హోదాలో కాదు. పార్లమెంటేరియన్ హోదాలో మాత్రమే. వెజ్ తాలీలో భాగంగా పాలకూర, సలాడ్, పప్పు, మరో కూర తదితరాలను ఆరగించేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు గుజరాత్ ఎంపీలు లాగించేశారు. ఈ భోజనానికి ఆయన రూ.29 రూపాయలు చెల్లించారు కూడా. అన్నట్లు పార్లమెంట్ సభ్యులకు అధిక సబ్సిడీతో ఇక్కడ వివిధ రకాల శాఖాహార , మాంసాహార భోజనం లభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకెల్లా అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆహార పదార్ధాలు లభించే చోటుగా పార్లమెంట్ క్యాంటీన్ గుర్తింపు పొందింది. ఇక్కడ అతి ఎక్కువ ఖరీదైంది చికెన్ బిర్యానీ. అవును దాని రేటు ఎంత అనుకుంటున్నారు? కేవలం రూ.34 మాత్రమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ