మేనిఫెస్టో లేకుండానే ఢిల్లీ పోరులో బీజేపీ

January 29, 2015 | 04:59 PM | 31 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున ఎన్నికల మేనిఫెస్లో ఉండబోదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఢిల్లీ పురోగతి కోసం రూపోందించిన ఓ విజన్ డాక్యుమెంటును ప్రకటిస్తామని ఆయన చెప్పారు. దాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ విడుదల చేస్తారని మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 7న ఢిల్లీలో పోలింగ్ జరగనుంది. ఈసారైనా విజయాన్ని చేజిక్కించుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటుచేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రెండోసారి అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా, బుధవారం ఓ జాతీయ న్యూస్ ఛానెల్ విడుదల చేసిన సర్వేలో ఆప్ కే ప్రజలు అధికారం కట్టబెడతారని తేలింది. ఈ నేపథ్యంలోని మేనిఫేస్టోలు లాంటివి లేవని ముందుగా చెప్పేసి బీజేపీ ఓటమిని ఒప్పుకుంటుందని ఆప్ నేత ఒకరు వ్యాఖ్యనించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ