అమ్మో! ఆస్తులు చెబితే ప్రియాంకను చంపేస్తారట

February 25, 2015 | 11:05 AM | 32 Views
ప్రింట్ కామెంట్
priyanka_gandhi_request_letter_to_HP_govt_dont_revelave_her_assets_niharonline

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ముద్దుల తనయ అయిన ప్రియాంకా గాంధీ ఆస్తుల వ్యవహారం పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో ఆమె ఆస్తులు సమకూర్చుకున్నారని వాటిని బహిర్గతం చేయాలని హిమాచల్ ప్రభుత్వానికి లేఖలు అందాయి. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆమెకు ఆస్తులున్నాయి. వాటి సేల్ డీడ్స్, డాక్యుమెంట్లు, పవర్ ఆఫ్ అటార్నీ తదితర వివరాలను అందజేయాలని దేవాశిష్ భట్టాచార్య అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అక్కడి ప్రభుత్వాన్ని కోరాడు. దీనికి స్పందిస్తూ ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రభుత్వానికి ఓ సంచలన లేఖ రాశారు. ‘నా ఆస్తుల వివరాలను వెల్లడిస్తే నా ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. అందువల్ల దయచేసి వాటి వివరాలను గొప్యంగా ఉంచండి’ అని ఆమె లేఖలో కోరారు. మొత్తానికి అక్కడి అధికారులు కూడా ఆమె ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ససేమిరా అన్నారు. ప్రియాంక స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) భద్రత పొందుతున్నారని, ఆమె ఆస్తుల గురించి బయటికి చెప్పలేమని తేల్చేశారు. అంతేకాదు తన ఆస్తుల వివరాలను వెల్లడించొద్దంటూ ఆమె గత ఏడాది జులైలో కూడా హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె ఒక లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక మరోవైపు ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు గత ప్రభుత్వాలు కేటాయించిన రాయితీలు, భూముల కేటాయింపులను రద్దు అయిన విషయం విదితమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ