సర్వే షాక్: అమ్మకు ఓటమి తప్పదా?

May 01, 2016 | 12:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
student-survey-favour-to-DMK-TN-niharonline

తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలితకు షాకిస్తున్నాయి ఓటర్ సర్వేలు. ఇప్పటికే ఆమె ఓటమి తప్పదని చెబుతున్న పలు చానెల్ సర్వేలు చాలదన్నట్లు తాజాగా మరో సర్వే వెలువడింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన సర్వేలో తేలింది. తదుపరి ప్రజలు డీఎంకేకు పట్టం కట్టనున్నారని చెన్నై లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. స్పష్టమైన మెజార్టీతో కరుణానిధి నేతృత్వంలోనీ డీఎంకే పీఠం అధిరోహించనుందని ఆ సంఘం సమన్వయకర్త తిరునావుక్కరసు తెలిపారు.

                                      మొత్తం సీట్లలో డీఎంకేకు 124, అన్నాడీఎంకే 90 స్థానాలకు పరిమితం కానుందని వివరించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించామని తెలిపారు. జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే ప్రధాన పోటీ వుంటుందని అత్యధికులు వెల్లడించగా, డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమికి 16 శాతం మంది మద్దతు పలికారని వివరించారు. డీఎంకేకు 39.04 శాతం, అన్నాడీఎంకేకు 35.22 శాతం ఓట్లు రానున్నాయని అంచనా వేశారు. తృతీయ కూటమితో అన్నా డీఎంకే ఓట్లు చీలనుండటం, డీఎంకేకు వరం కానుందని వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ