గ్రేటర్ లో వైట్ వాష్ పై గులాబీ గురి!

February 09, 2016 | 10:47 AM | 1 Views
ప్రింట్ కామెంట్
three-more-MLAs-join-in-TRS-after-GHMC-result-niharonline

ఊహించిన పరిణామాలే జరగబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పక్షంలోకి మరిన్ని జంప్ జిలానీలు ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు. అనుకున్నట్లు గానే ఆ తంతు జరగనున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. కేసీఆర్ హవా సాగుతుండటంతో, విపక్షంలో ఉంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అనుకున్నారో, ఏమో, మరో ముగ్గురు శాసనసభ్యులు టీఆర్ఎస్ లోకి జంప్ చేయబోతున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

                                  ఇక వీరంతా గ్రేటర్ పరిధిలోని వారేనని తెలుస్తున్నప్పటికీ, అయితే ఎవరన్నది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. నేడు లేదా రేపు, వీరంతా సీఎంను ఆయన నివాసంలోనే కలిసి ఆపై టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటిస్తారని సమాచారం. గతంలో ఎట్టి పరిస్థితిలో సొంత పార్టీలను వీడబోమని గాంభీర్యాలు పలికిన ఓ ఎమ్మెల్యేనే ముందుండి మిగతా ఇద్దరిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. వీరిని చేర్చుకున్న తరువాతనే నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల ప్రచార సభకు కేసీఆర్ వెళ్తారని కూడా తెలుస్తోంది. ఇదే జరిగితే, జంటనగరాల్లో ఎంఐఎం మినహా మిగతా పార్టీలేవీ నాయకత్వ లేమితో మనగుడ కొనసాగించలేవన్నది ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ