వెంకయ్యకి ఇప్పుడు ఏపీ అవసరం వచ్చింది

April 30, 2016 | 10:37 AM | 2 Views
ప్రింట్ కామెంట్
venkaiah-naidu-may-contest-from-AP-rajya-sabha-niharonline

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుకి ఆంధ్రప్రదేశ్ అవసరం కానుంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి  రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవికాలం జూన్ 30తో ముగియనుంది. దీంతో వచ్చే దఫా ఏపీ నుంచి పెద్దల సభ సీటు కోసం ఆయన పోటీపడనున్నారంట. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు అంతగా స్పష్టత లేకున్నా, రాజ్యసభ సీటు కోసం ఆయన తన సొంత రాష్ట్రాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితులున్నాయని విశ్లేషకుల అంచనా. కర్ణాటక నుంచి పెద్దల సభకు ఎన్నికైన వెంకయ్యతో పాటు విజయ్ మాల్యా, ఆస్కార్ ఫెర్నాండెజ్, అయనూరు మంజునాథల పదవీకాలం జూన్ 30తో ముగుస్తోంది.

                              ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలోని బలాబలాల ఆధారంగా... ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు ఎంపీ సీట్లు, విపక్షంలో ఉన్న బీజేపీకి ఓ సీటు సులభంగానే దక్కనున్నాయి. ఇక మిగిలిన సీటు కోసం కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. బీజేపీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సింగిల్ సీటును ఆ రాష్ట్ర పార్టీ శాఖ కొత్త చీఫ్ బీఎస్ యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ అయనూరు మంజునాథకు కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ దఫా రాజ్యసభ సభ్యత్వం కోసం వెంకయ్య కర్ణాటక నుంచి కాకుండా తన సొంత రాష్ట్రం ఏపీకి తరలిరానున్నట్లు ప్రచారం సాగుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ