మాట నిలబెట్టుకున్నారు... లక్ష మెజారిటీతో గెలిచిన సుగుణమ్మ

February 16, 2015 | 12:35 PM | 35 Views
ప్రింట్ కామెంట్
venkataramana_wife_sugunamma_won_in_tirupathi_poll

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై 1,16,524 పరుగుల తేడాతో ఆమె విజయం సాధించారు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ గుండెపోటుతో చనిపోవటంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. పదవిలో ఉండగా ఎవరైనా నేత చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఆ స్థానానికి ఏకగ్రీవంగా పంపాలన్న సంప్రదాయం ఉంది. దానికి తిలోదకాలిస్తూ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలో దించింది. దీంతో లోక్ సత్తా, పలువురు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వెంకటరమణ సతీమణి సుగుణమ్మ కు ఎన్నికల బరిలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. వెంకటరమణకు మంచినేతగా ప్రజల్లో పేరుండేది. దీంతో ప్రజలు కూడా ఆయన భార్యకే పట్టం కట్టి భారీ మెజార్టీతో గెలిపించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ